Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆ హాస్టల్ను పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయించా లంటూ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్, కళాశాల విద్యార్థినులతో ఆమె సమావేశమయ్యారు.
నిజాం కళాశాల విద్యార్థినుల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు సూచన మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్గదర్శక నిబంధనలకు అనుగుణంగా వసతి కల్పించాలంటూ అధికారులను ఆమె ఆదేశించారు. విద్యార్థినిలందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా నిజాం కళాశాలలో యూజీ విద్యార్థినిలకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. వారికి కావాల్సిన ఏర్పాట్లను చేయాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు.