Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు ఈనెల 17వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ బుధవారం షెడ్యూల్ను విడుదల చేశారు. ఈనెల 17న ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలనీ, హెల్ప్లైన్ సెంటర్లలో ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 22న తుదివిడత కౌన్సెలింగ్లో అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్్జూర://్రవaఎషవ్b.అఱష.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.