Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గార్మెంట్ ఫ్యాక్టరీలు : మంత్రి కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్తో సమావేశమయ్యారు. ప్రజల్లో పాపులారిటీ సంపాదించుకున్న ఇన్నర్ వేర్ బ్రాండ్ జాకీ(పేజ్ ఇండిస్టీస్) ఇబ్రహీంపట్నం, ములుగులో గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతుందని బుధవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ''ఒక కోటి బట్టలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు. దీంతో 7 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జాకీ కంపెనీకి హృదయపూర్వక స్వాగతం'' అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.