Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన 'ధరణి' పాపాల పుట్టగా మారిందని తెలంగాన రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారగోని ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఈ మేరకు గురువారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ధరణి వల్ల 9 లక్షల మంది రైతులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం సాదాబైనామాలు రద్దు చేసిందని ప్రశ్నించారు. సరిహద్దులు లేకుండా ధరణిలో భూమిని నమోదు చేస్తున్నారని తెలిపారు. ధరణి వచ్చాక ఎన్ని లక్షల ఎకరాల భూమి ఎవరెవరి పేర్లమీదికి మారిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.