Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో 4.50 కోట్ల మొక్కలు
- పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం
- అందరికీ అనువైన ఆవాసప్రాంతం
- హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న 158 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) మొత్తాన్ని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో పచ్చహారంగా అభివృద్ధి చేశారు. నగరంలో ఎటుచూసినా పచ్చని చెట్లు, పార్కులతో హైదరాబాద్ మహానగరం ఆహ్లాదకరంగా కనిపిస్తున్నది. ఓఆర్ఆర్పై నుంచి వెళ్లే వాహనదారులకి మంచి అనుభూతిని జ్ఞాపకంగా మిగుల్చుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా చేపట్టిన తెలంగాణకు హరితహారం అమలులో హెచ్ఎండీఏ ముందున్నది.
పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు నగరాన్ని అత్యంత నివాసయోగ్య ప్రాంతంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నది. అందులో భాగంగా హెచ్ఎండీఏ ప్రతియేటా వివిధ ప్రాజెక్ట్స్ కింద కోట్లాది మొక్కలను నాటించి, సంరక్షిస్తున్నది. సొంత నర్సరీల ద్వారా నగరంలోని పలు ప్రాంతాలను లంగ్ స్పేస్లుగా ఆహ్లాదకరంగా అభివృద్ధి చేస్తున్నది.
రూ.289.09 కోట్లతో 4.50కోట్ల మొక్కలు
హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్టీ ఆధ్వర్యంలో 2022-23 సీజన్లో రూ.298.09 కోట్లతో తెలంగాణకు హరితహారం కింద 4.50 కోట్ల మొక్కలను నాటారు. పచ్చదనం అభివృద్ధిలో హెచ్ఎండీఏ అగ్రభాగంలో ఉంది. 71.15 లక్షల మొక్కలను నాటి ఔటర్ రింగ్ రోడ్ (158 కి.మీ.), ఇంటర్ఛేంజీలు (457.23 ఎకరాలు), సర్వీస్రోడ్, రైల్వే కారిడార్లు మొదలైన వాటితోపాటు ఇంటెన్సివ్ ప్లాంటేషన్ ద్వారా గ్రీన్ కారిడార్ను అభివృద్ధి చేసింది. మొక్కలకు నీరందించేందుకు ఓఆర్ఆర్లో బిందు సేద్యం పరికరాలు అమర్చారు. బిందు సేద్యం పరికరాలు స్కాడా సాఫ్ట్వేర్ ఆధారిత ఆటోమేషన్పై పని చేస్తున్నాయి. ఈ పద్ధతిని పాటించడంతో ఓఆర్ఆర్లో డ్రిప్ ఇరిగేషన్కు రూ.5.09 కోట్లు ఆదా అవుతున్నది రూ.116.62 కోట్లతో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 14708.24 ఎకరాల విస్తీర్ణంలో (16) ఫారెస్ట్ బ్లాక్లలో అర్బన్ లంగ్ స్పేసెస్గా గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నది. 16 రిజర్వ్ ఫారెస్ట్ పార్కుల్లో, ఆరు పార్కులు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. హెచ్ఎండీఏ పరిధిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఆర్అండ్బీ రోడ్లు, హెచ్ఎండీఏ రోడ్ల వెంట సెంట్రల్ మీడియన్-మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్లు 672.5 కిలోమీటర్లు, అవెన్యూ ప్లాంటేషన్లు 269.8 కిలోమీటర్లను అభివృద్ధి చేశారు.
2022-23 సీజన్లో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 5 కోట్ల మొక్కలను 42 నర్సరీలలో పెంచారు. హెచ్ఎండీఏకు చెందిన తెల్లాపూర్ నర్సరీ రాష్ట్రంలోని ఉత్తమ నర్సరీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. హెచ్ఎండీఏ పరిధిలోని 14 సరస్సుల్లో గ్రీనరీని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం వల్ల సేదతీర్చే ఆహ్లాదకర ప్రాంతాలుగా రూపొందాయి.
వాటిలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్ సహా 39 అర్బన్ పార్కులను అర్బన్ లంగ్ స్పేస్లుగా అభివృద్ధి చేశారు. తద్వారా యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అర్బోర్ డే ఫౌండేషన్ వారు ట్రీ సిటీ అవార్డు అందించారు. హైదరాబాద్కు ట్రీసిటీ అవార్డు రావడం ఇది రెండోసారి. 2020 సంవత్సరానికి మొదటి అవార్డు, 2021 సంవత్సరానికి రెండో అవార్డు లభించింది. పచ్చదనం పెంపుదలకు ప్రభుత్వం చేస్తున్న కషికి లభించిన పురష్కారమిది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 నివేదిక ప్రకారం దేశంలో ఒక దశాబ్దంలో 48.66 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అత్యధిక గ్రీన్ కవర్ను పొందిన మెగా నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది.