Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజులో 40 శాతం మినహాయింపు : మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ స్కాలర్షిప్నకు అర్హత లేని త్రిపుల్ఐటీ బాసర విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. కరోనా నేపథ్యంలో గత రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించి ఫీజులో 40 శాతం మినహాయింపునివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో కరోనా విస్తరించిన నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు జరగకపోవడం, వసతి గృహాల నిర్వహణ లేకపోవడం వల్ల విద్యార్థులపై భారం పడకుండా ఈ మినహాయింపునిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి విద్యార్థులకు ఊరట కల్పించిందని వివరించారు. ప్రభుత్వ పరంగా స్కాలర్షిప్నకు అర్హత ఉన్న విద్యార్థులకు సకాలంలో అది అందలేదన్న కారణంతో వారి సర్టిఫికెట్లను ఇవ్వకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తన దృష్టికి పలువురు విద్యార్థులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. స్కాలర్షిప్తో సంబంధం లేకుండా విద్యార్థులకు వారి సర్టిఫికెట్లను అడిగిన వెంటనే అందించాలని త్రిపుల్ఐటీ బాసర వైస్ ఛాన్సలర్ (వీసీ)ని మంత్రి ఆదేశించారు.