Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు సిట్ అధికారులు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు అందజేశారు. కమాండ్ కంట్రోల్లోని సిట్ కార్యాలయంలో ఈనెల 21న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ వ్యవహరంలో గురువారం కరీంనగర్కు చెందిన న్యాయవాది, ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బంధువు.. శ్రీనివాస్కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.