Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోనాల్డ్ రాస్కు పీపీఎల్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గురుకులాల్లో చదువుతున్న పిల్లల సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (ప్రొగ్రెసివ్ పేరెంట్స్ లీగ్-పీపీఎల్) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం పీపీఎల్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నర్సన్న, ఉపాధ్యక్షులు సమగళ్ల నరేష్, సంయుక్త కార్యదర్శి పులెందర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియనల్ విద్యాలయాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ ను కలిసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. భోజన సదుపాయం, శీతాకాలం ప్రారంభమైనా ఇప్పటికీ బ్లాంకెట్లు ఇవ్వకపోవడంతో పాటు పిల్లలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే సరూర్ నగర్ పాఠశాలలో జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.