Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
పంజాబ్లోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయడానికి ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజరు కుమార్ సిన్హా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఎన్ఎంఓపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ, తెలంగాణ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్గౌడ్ శనివారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమర్థం పాత పెన్షన్ అమలు చేయడం పట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేసే ఆరో రాష్ట్రంగా కావాలని ఆకాంక్షించారు. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు ఆయా మ్యానిఫెస్టోల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేస్తామంటూ హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా ఉద్యోగుల సంక్షేమార్దం పాత పెన్షన్ అమలు చేస్తామంటూ మ్యానిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు.