Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ ఎంపీ అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఎమ్మెల్సీలు వి. గంగాధర్ గౌడ్, రాజేశ్వర్రావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లో సంస్కారహీనుడు అరవింద్ రాజకీయాలకే ఒక కళంకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ చేసిందేమి లేదని విమర్శించారు. బాండ్ పేపర్పై పసుపు బోర్డు తెస్తానని మాట తప్పారన్నారు. అరవింద్ను గ్రామాల్లోకి రానివ్వడం లేదని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.