Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
- గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-మియాపూర్
ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చి బౌలి టెలికాంనగర్కు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు స్థానిక విజయభారతి స్కూల్లో చదువుతు న్నారు. శనివారం మధ్యాహ్నం సమ యంలో నానక్రాంగూడ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న పటేల్కుంట చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. వీరిలో ఎవరికీ ఈత రాదు. అయినా, మొదటగా ముగ్గురు పిల్లలు షాభాజ్(15), దీపక్ (12), పవన్(13) చెరువులోకి దిగారు. మిగతా ఆరుగురు ఒడ్డుపైనే ఉన్నారు. చెరువులోకి దిగిన ముగ్గురు చెరువు లోతు అంచనా వేయకుండా లోపలికి వెళ్లడంతో మునిగిపోయారు.