Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) పార్టీ నాయకులు సింగరేణి యూనియన్లో సుధీర్ఘకాలం పనిచేసిన మేకల రాయమల్లు ఆకస్మిక మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మతికి శనివారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. రాయమల్లు సింగరేణి ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేశారని పేర్కొన్నారు. అనేక ఆటుపోట్లను నిర్బంధాన్ని ఎదుర్కొన్నారని వివరించారు. కొత్తగూడెం పార్టీ ఉద్యమంలో పాలుపంచుకున్నారని తెలిపారు. ఆయన పెద్దల్లుడు బి వెంకట్ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అనేక నిర్బంధాలు తట్టుకుని వారి కూతుళ్లు, తమ్ముల్లు, కుటుంబమంతా నేటికీ పార్టీతోనే ఉందని వివరించారు. రాయమల్లు అకస్మాత్తుగా మరణించడం విచారకరమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు కమిటీ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
చెరుపల్లి దిగ్భ్రాంతి
రాయమల్లు మరణం పట్ల సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీ, ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని తెలిపారు. ఆయన మృతికి నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్ సంతాపం ప్రకటించారు.