Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాలల హక్కులు, ఆరోగ్యం, భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఈ సందర్భంగా తెలియజేశారు. చిన్నారుల హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బాలల కోసం రాష్ట్రంలో ప్రత్యేకమైన సదనాలు, బాలల హక్కుల వారి పరిరక్షణకు కమిషన్, సంక్షేమ కమిటీలు పనిచేస్తున్నాయన్నారు. అంగన్వాడీల ద్వారా ఆరోగ్య లక్ష్మీ పధకం లో భాగంగా బాలామృతం వంటి పోషకాహారాలు అందిస్తోందన్నారు. గురుకులాల్లో సమతుల సంపూర్ణ ఆహారాన్ని అందించడం ద్వారా వారి మానసిక వికాసానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.