Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా పి.ప్రభా కర్ను ఎన్నుకు న్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగాఉన్న పి.ప్రభాకర్ ను కొత్తగా కార్యదర్శి వర్గంలోకి తీసుకోవాలని రాష్ట్ర కమిటీలో నిర్ణయం జరిగిందని తెలిపారు. విద్యార్థి, యువజన రంగాల్లోనూ, హైదరాబాద్ నగర ఉద్యమంలోనూ ప్రభాకర్ పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. ప్రజాశక్తి దిన పత్రిక, సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాధ్యతల్లో పనిచేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం నవతెలంగాణ పత్రిక సీజీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.