Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ లాంగ్మెమోలను జారీ చేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి వార్షిక, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పరీక్షల్లో వారందరి మెమోలను ఆయా పాఠశాలలకు పంపించామని పేర్కొన్నారు. అక్కడి ప్రధానోపాధ్యాయులను సంప్రదించి వాటిని తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మేలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలు జూన్ 30న విడుదలైన సంగతి తెలిసిందే. 5,03,579 మంది విద్యార్థులు రెగ్యులర్ హాజరైతే 4,53,201 మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ ఒకటిన విడుదల చేసిన సంగతి విదితమే. అందులో 38,477 మంది పాసయ్యారు. వార్షిక, సప్లిమెంటరీ పరీక్షల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 4,91,678 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.