Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధరణి పోర్టల్లోని సమస్యలతోపాటు లొసుగులను పరిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సర్వేనెంబర్ల వారీగా డిజిటల్ సర్వే చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. సాదాబైనామాలకు ధరణి పోర్టల్లో ఆప్షన్ ఇవ్వాలని తెలిపారు. మీసేవలో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. గతంలో పట్టాపై ఆధార్కార్డులాంటివి అనుసంధానం కాకపోవడం, సంబంధిత సాంకేతిక సమస్యల వల్ల సన్న,చిన్న, నిరుపేద రైతులు వాస్తవసాగుదార్లు రైతుబీమా, రైతుబంధు తీసుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని సరిచేయాలని తెలిపారు. భూప్రక్షాళన కార్యక్రమంలో వాస్తవ పట్టాదారులకు బదులుగా ఇతర వ్యక్తుల పేర్లు పట్టాదార్లుగా నమోదయ్యాయని వివరించారు. వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని ధరణిలో ఒరిజినల్ పట్టాదార్ల పేర్లను నమోదు చేయాలని కోరారు.