Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిరాశలో ఉన్న బాధిత మహిళ సంధ్య (చేర్యాల), ఆమె ముగ్గురు పిల్లలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లాను రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అభినందించారు.
గతంలో గవర్నర్ భైరాన్పల్లి పర్యటనకు వెళ్లిన సందర్భంగా సంధ్య రాణి గవర్నర్ కాన్వారుకు అడ్డుపడింది. ఆ సందర్భంగా గవర్నర్ ఆమె ఇంటిని సందర్శించి సమస్యలను అడిగి, సాధ్యమైనంత మేరకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. సంధ్యారాణి గురించి తమిళిసై ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు స్పంందించి సుచిత్ర ఎల్లా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ రాజ్ భవన్కు వచ్చిన సుచిత్ర తమిళిసైతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ కార్యాలయ సిబ్బంది సంధ్యారాణి, ఆమె ముగ్గురు పిల్లల పరిస్థితిని సుచిత్రకు వివరించారు.