Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ పార్టీ నేత బీఎల్ సంతోష్జీ పైనే కేసు పెట్టించిన కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం శామీర్పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంతోష్జీకి కేసీఆర్ లెక్క ఆస్తిపాస్తులు, విదేశాల్లో పెట్టుబడులు లేవన్నారు. బంధాలను త్యజించి దేశ హితమే లక్ష్యంగా సేవ చేస్తున్న ప్రచారక్ వ్యవస్థనే కించపర్చడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకొస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు ఖాయం, తెలంగాణ చేతికి చిప్ప తథ్యం అని విమర్శించారు. ఏడాదిన్నరలో 10 లక్షలకుపైగా ఉద్యోగ నియామక పత్రాలిస్తున్న ప్రధాని మోడీనే అన్నారు. 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్క ఉద్యోగం భర్తీ చేయని పాలన కేసీఆర్దే అని చెప్పారు. కాంగ్రెస్ అంతమైన పార్టీ అనీ, కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాన్ని సీఎం కాళ్ల దగ్గర పెట్టారని ఆరోపించారు. అన్ని పార్టీలు ఏకమై కుట్ర పన్నినా తెలంగాణలో బీజేపీని అడ్డుకోలేవన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే... ఉచిత విద్య, వైద్యం, పక్కా గృహాల నిర్మాణం, పంట నష్టపరిహారం హామీలను అమలు చేసి తీరుతామని చెప్పారు. కేసీఆర్ నియంత పాలనను ఎండగట్టి ప్రజలకు భరోసా కల్పించేందుకు ఐదో విడత పాదయాత్రను నిర్మల్ జిల్లాలో ఈ నెల 28న ప్రారంభించనున్నట్టు తెలిపారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.