Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.పద్మ, పి.జయలక్ష్మి
నవతెలంగాణ - భువనగిరి
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర నాలుగో మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభ ఈ నెల 20, 21 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా 65 మందితో నూతన కమిటీ ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షులుగా ఎం.పద్మ (సిద్దిపేట), ప్రధాన కార్యదర్శిగా పి.జయలక్ష్మి (రాష్ట్ర కేంద్రం), కోశాధికారిగా కె.సునీత (ఆదిలాబాద్) ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా ఈ.వెంకటమ్మ (భద్రాద్రి కొత్తగూడెం), జి.జ్యోతి (పెద్దపల్లి), ఏమెలమ్మ (గద్వాల), జి.కవిత (రంగారెడ్డి), టి.పార్వతి (నాగర్ కర్నూల్), డి.సునీత (ఆదిలాబాద్), కోటేశ్వరి (ఖమ్మం), సహాయ కార్యదర్శులుగా జి.పద్మ (భద్రాద్రి కొత్తగూడెం), పి.మంగ (సంగారెడ్డి), కె.నర్సమ్మ (మెదక్), స్వర్ణ (నిజామాబాద్), బి.స్వప్న (యాదాద్రి భువనగిరి), శారద (వనపర్తి), త్రివేణి (కొమురం భీం) ఎన్నికయ్యారు.