Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికైనా సర్కారు కండ్లు తెరవాలి
- సీఎం కేసీఆర్కు రేవంత్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎఫ్ఆర్వో శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యేనని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరవాలని కోరారు. ఈమేరకు బుధవారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. తెలంగాణలో పోడు భూముల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అందుకే అటవీ శాఖ అధికారులు, పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల మధ్య నిత్యం చిచ్చు రేగుతున్నదని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి (ఎఫ్ఆర్వో) చలమల శ్రీనివాసరావు గుత్తికోయల దాడిలో హత్యకు గురికావడం చాలా దారుణ మని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనంతోనే ఒక అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు. 'పోడు భూములపై హక్కులు కల్పిస్తామని గత ఎనిమిదేండ్లు గా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులను ఊరిస్తూ వస్తు న్నది. మరోవైపు అటవీ భూములను సేద్యం చేస్తున్నారని వివ రించారు. ఇదే గిరిజనులపైకి అధికారు లను ఎగదోస్తూ చోద్యం చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల తెలంగాణ వచ్చినప్పటి నుంచి అటవీ శాఖ అధికా రులు, గిరిజనుల మధ్య నిత్యం ఘర్షణ లు జరుగుతూనే ఉన్నాయి. పోడు భూ ముల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలు నాటేందుకు రావడం, గిరిజనులు అడ్డుకోవడం, వారి మధ్య గొడవలు జరగడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది గిరిజ నులపై కేసులు పెట్టారు. పోడు భూములు సాగు చేస్తున్న రైతులు పోరాటాలు, ఉద్యమాలు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పోడు భూములకు పట్టాలిస్తాం అని అసెంబ్లీలో ప్రకటన చేసి మూడేండ్లు గడిచింది. పోడు సమ స్య పరిష్కారానికి గతేడాది సెప్టెంబర్ 16న మంత్రి సత్యవతి రాథోడ్ ఛైర్ పర్సన్గా ఒక కమిటీని నియమించారు. కమిటీ ని నియమించి దాదాపు 14 నెలలైనా ఇంత వరకు అతీగతీ లేదు. అధికారులు అభద్రతా భావంతో విధులు నిర్వహించాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి' అని పేర్కొన్నారు.