Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతు ధర ఇవ్వడంలో మోడీ ప్రభుత్వం విఫలం : ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ -మహబూబ్నగర్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచేందుకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తోందని ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం తెెలంగాణ రైతు సంఘం జిల్లా 9వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించకుండా ఆ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లా రైతాంగానికి నీరు అందించాలని, ప్రాజెక్టు పరిధిలో భూములు, ఇండ్లు కోల్పోయిన రైతులకు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ధరణిలో రైతు సమస్యలను పరిష్కరించాలని మహాసభలో తీర్మానం చేశారు. అనంతరం 15 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గుండుమల్ల నర్సింహులు, ఉపాధ్యక్షులుగా ఏ.రాములు, ప్రధాన కార్యదర్శిగా ఎ.లక్ష్మయ్య, సహాయ కార్యదర్శిగా జె.మధు, జె. బాల్ రెడ్డి తదితరులను ఎన్నుకున్నారు.