Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు నెలలుగా పట్టించుకోవడం లేదంటూ అధికారుల ఘెరావ్
నవతెలంగాణ-మంగపేట
మూడు నెలలుగా తాగునీరు రాక అల్లాడుతున్నా పట్టించుకోని అధికారులు ఇంటి, నల్లా పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారంటూ మహిళలు గ్రామపంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను ఘెరావ్ చేశారు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బిల్ట్ కర్మాగారం నడిచే రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు చెందిన 1000 మందికి పైగా కార్మికులు కమలాపురం గోదావరి రోడ్డులో ఆవాసాలు ఏర్పరుచుకున్నారు. 2015 ఏప్రిల్ 15న కర్మాగారం మూతపడటంతో కొన్ని కుటుంబాలు తిరిగి వెళ్లిపోయాయి. వందకు పైగా కుటుంబాలు 30 సంవత్సరాలకు పైగా ఇక్కడే జీవనం సాగిస్తున్నాయి.