Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పథకాలు , సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఈ నెల 22 నుంచి 24వరకు మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నీటి వనరుల అభివృద్ధి, తెలంగాణ ఆర్ధిక వనరులు, వ్యవసాయం, సంక్షేమం, వైద్య, విద్య తదితర అంశాలపై ఆయారంగాల నిష్ణాతులతో శిక్షణ నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ మహేశ్ బెనహర్ దత్ ఎక్కా ఆదేశాల మేరకు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ పింగిల్, డాక్టర్ శ్రీనివాస్, కోర్స్ కో-ఆర్డినేటర్ పర్యవేక్షణలో వీటిని నిర్వహించారు. ముగింపు సందర్భంగా డ్టాక్టర్ రావులపాటి మాధవి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ మహిళా భద్రత కోసం అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ వివరాలను ఐ అండ్ పీఆర్ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.