Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పిల్లల్లో కనీస సామర్థ్యాలు పెంపొందించడానికి ఏర్పాటు చేసిన ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని పీఆర్టీయూటీఎస్ తెలిపింది. ఈ మేరకు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటును మొదటినుంచి వివిధ హోదాతల్లో అధికారులు పరిశీలిస్తున్నప్పటికీ తిరిగి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయడంతోపాటు అందులో ఎన్జీవోలను సభ్యులుగా చేర్చడం ఉపాధ్యాయులను అవమానపరిచినట్టుగానే భావిస్తున్నామని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు ఈ టాస్క్ఫోర్స్ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలకు కావాల్సిన మౌలిక వసతులను పెంపొందించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.