Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ హర్షం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర పట్టణాభివద్ధి శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల జాబితాలో రాష్ట్రానికి చెందిన మరో 7 మున్సిపాల్టీలకు స్థానం లభించింది. ఆజాదీ కా అమత్ మహౌత్సవ్ సందర్భంగా రాష్ట్రానికి ఇప్పటికే 16 అవార్డులు లభించాయి. తాజాగా మరో మూడు కేటగిరిల్లో కాగజ్ నగర్, జనగామ, అమన్గల్, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్దన్నపేట, గ్రేటర్ వరంగల్ పురపాలికలకు ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ కేటగిరిలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దీంతో రాష్ట్రానికి మొత్తం 26 అవార్డులు లభించాయి. దీనివై ఐటీ,పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆలోచనల్లో నుంచి ఆవిర్భవించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో ఈ గుర్తింపు సాధ్యమైందన్నారు. జాతీయస్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చిన పురపాలికలకు ఆయన రూ.2 కోట్ల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహక నిధులు ప్రకటించారు.