Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఫ్యాషన్ ప్రియులకోసం నగరంలో సరికొత్త వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు పరిణయ ఈవెంట్స్ అండ్ ఎగ్జిబిషన్ సంస్థ నిర్వాహకులు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో 'పరిణయ' హై ఫై వెడ్డింగ్ కలెక్షన్స్ వస్త్ర ప్రదర్శన' నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వస్త్ర ప్రదర్శనలో పలు రాష్ట్రాలకు చెందిన సరికొత్త ఫ్యాషన్ డిజైన్లతో పాటు దేశంలోని వివిధ నగరాల నుంచి దాదాపు 90 మంది మాస్టర్ వీవర్స్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, జైపూర్, కోల్కతా, గుజరాత్, చెన్నై తదితర ప్రాంతాల డిజైనర్లు తయారుచేసిన కాంజీవరం, బజారస్, జరీకోట, పత్నీస్ తదితర కలెక్షన్లు లభిస్తాయని చెప్పారు. మూడురోజుల ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని వివరించారు.