Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను ఆదేశించిన సీఎస్ సోమేశ్కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కొత్త సభ్యులతో నూతన స్వయం సహాయక బృందాల ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్ర వారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఆ బృందాల పనితీరుపై సీఎస్ సమీక్షించారు. ఈ సమావేశా నికి ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచా యతీ రాజ్ శాఖ కమిషనర్ రఘు నందన్రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, సెర్ప్ డైరెక్టర్ వైఎన్రెడ్డి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శృతి ఓఝా, శ్రీనిధి ఎమ్డీ విద్యాసాగర్, తదితరు లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రస్తుతమున్న 6,06,000 స్వయం సహాయక బృందాలలో 64 లక్షల మంది సభ్యులున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 4,30,785 బృందాలలో 46లక్షలకుపైగా సభ్యులు ండగా, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 1,76,623 బృందాల్లో దాదాపు 18 లక్షల మంది సభ్యులున్నారని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాలలో గ్రూపుల్లో చేరని సభ్యులను గుర్తించి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్హెచ్జీ గ్రూపులు, సభ్యుల వివరాలను పూర్తి స్థాయిలో అప్-డేట్ చేయాలనీ, సభ్యులందరికీ క్యూఆర్ కోడ్ కలిగిన ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం బ్యాంకుల ద్వారా పొందుతున్న వడ్డీ లేని రుణాల మొత్తాలను ఉత్పాదక రంగాలలో ఉపయోగించేలా చర్యలు తీసు కోవాలని సూచించారు. స్వయం సహాయక బృందాల సభ్యులకు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ద్వారా వారి ఆదాయమార్గాలను పెంపొందించేందు చర్యలు తీసుకోవాలని కోరారు.