Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 8 తేదీ నుంచి పీఎంటీ, పీఈటీ దేహదారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మెన్ వి.వి. శ్రీనివాస్రావు ఆదివారం తెలిపారు. ఈ దేహదారుఢ్య పరీక్షలను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, సిద్ధిపేట్, మహబూబ్నగర్ లలో నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. కానిస్టేబుల్, ఎస్సై ప్రాథమిక పరీక్షలో పాసైన అభ్యర్థులు ఈనెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు తమ అధికారిక వైబ్సైట్ www.tslprb.in నుంచి అడ్మిట్ కార్డులను తమ యూజర్ పాస్వర్డ్లతో డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు. 29వ తేదీ ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ 3వ తేదీ రాత్రి 12 గంటల వరకు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పురుషుల కోసం 1600 మీటర్లు, మహిళల కోసం 800 మీటర్ల పరుగు పందెంలో నెగ్గినవారికి లాంగ్ జంప్, షార్ట్పుట్ పరీక్షలుంటాయని చెప్పారు. పరుగు పరీక్షలో నెగ్గినవారికి పీఎంటీ ఉంటుందనీ, అందులో ఒక అంగులం తక్కువై తిరస్కరణకు గురైన అభ్యర్థులు అక్కడే ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారి వద్ద తమ అభ్యంతరం తెలిపి మరోసారి పీఎంటీ టెస్టు చేయించుకోవచ్చనీ, ఈ ప్రక్రియను ఓ సీనియర్ స్థాయి సూపరింటెండెంట్ అధికారి పర్యవేక్షిస్తారని ఆయన వివరించారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను ఒక రోజు ముందే వెళ్లి చూసుకొని రావాలనీ, పరీక్ష రోజు సెల్ఫోన్ మొదలుకొని ఎలాంటి వస్తువులనుకానీ, లేగేజీని కానీ వెంట తీసుకురాకూడదని ఆయన తెలిపారు. అలాగే, మహిళా అభ్యర్థులు తమ వెంట విలువైన ఆభరణాలను వేటిని కూడా తీసుకురావద్దనీ, వాటిని ప్రత్యేకంగా భద్రపర్చడానికి పరీక్ష కేంద్రాల వద్ద లాకర్ వంటి ఏర్పాట్లుండవని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ పీఎంటీ, పీఈటీ లు నిర్ణీత 8వ తేదీ నుంచి జనవరి 3లోగా పూర్తవుతాయని శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే తమ వెబ్సైట్ను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు.