Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి పర్యవేక్షణ కోసం సీఎం కేసీఆర్ సోమవారం అక్కడికి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుండి బయలు దేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి వాయుమార్గం ద్వారా ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటలకు కల్లా దామరచర్ల చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని విద్యుత్ శాఖ మంత్రి మంత్రి జగదీశ్రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలిస్తారు. అనంతరం సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం హైద్రాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.