Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-ములుగు
సీఎం కేసీఆర్ నా వెంట ఉన్నంత వరకు ఎలాంటి రైడ్స్కు భయపడనని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్అండ్ఆర్ కాలనీ బహిలింపూర్లో మాజీ సర్పంచ్ నేర్లపల్లి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదగిరి రెడ్డితో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశమంతా ఇన్కమ్ట్యాక్స్ రూల్స్ మారుస్తామన్నారు. దేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చన్నారు. సంపాదించుకున్న వాళ్లు వాళ్లంతట వాళ్లు ట్యాక్స్ చెల్లించుకునే విధంగా సీఎం కేసీఆర్ రూల్స్ తీసుకొస్తారని చెప్పారు. మొండివైఖరితో ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వద్దన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనపరుడని, బీఆర్ఎస్తోనే దేశం మొత్తం అభివృద్ధి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్రెడ్డి, ములుగు జెడ్పీటీసీ జయమ్మ అర్జున్గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.