Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31 కి.మీ మెట్రో నిర్మాణానికి రూ.6250 కోట్లు ఖర్చు
- రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ మెగా ప్రాజెక్ట్కు ప్రణాళిక
- డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగల్ ఇచ్చిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణ చేపట్టనున్నట్టు ఆదివారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మైండ్ స్పేస్ జంక్షన్ వద్దనున్న రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ మెట్రో కారిడార్ను విస్తరించనున్నారు. మొత్తం 31 కిలోమీటర్ల పొడవుతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.6,250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. వచ్చే మూడేండ్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. ఈ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని తెలిపారు. ఈ మెట్రో.. వయా, బయో డైవర్సిటీ జంక్షన్ కాజాగూడ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వద్దగల నానక్రామ్ గూడ జంక్షన్ను తాకుతూ వెళ్లనుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా(రైట్ ఆఫ్ వే) మెట్రో రైలు నడుస్తుంది. ఈ మార్గం వెంట పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను నిర్మించుకుంటుండటంతో భవిష్యత్తులో నగర రూపురేఖలే మారనున్నాయి.
కేటీఆర్ ట్వీట్పై స్పందించిన ఓవైసీ
శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో రైలు విస్తరణపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఎంజీబీఎస్-ఫలక్నుమా కారిడార్-2 పనులు ప్రారంభించాలని కోరారు. 5.5 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కారిడార్కు రూ.500 కోట్లు కేటాయించారని తెలిపారు. పరిసర ప్రాంతాల యువత హైటెక్ సిటీ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమని పేర్కొన్నారు.