Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళ బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి పిటిషన్ వేశారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణపై స్టే విధించాలని పిటిషన్లో కోరారు. పిటిషన్లో సీఎం కేసీఆర్ను వ్యక్తిగత హౌదాలో ప్రతివాదిగా తుషార్ పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని తుషార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 21న విచారణకు రావాలని 16న 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇచ్చారన్నారు. అనారోగ్యం వల్ల వైద్యుల సూచన మేరకు రెండు వారాల గడువు కోరుతూ మెయిల్ చేసినట్టు చెప్పారు. అయితే, తన మెయిల్కు సమాధానం ఇవ్వకుండా లుకౌట్ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమే అవుతుందని పిటిషన్లో తుషార్ పేర్కొన్నారు.