Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్డబ్ల్యూ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ మంగళవారం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ఆర్ లింబాద్రి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీల్లో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లుంటాయని తెలిపారు. ఇతర వివరాలకు https://dost.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.