Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ వి హనుమంతరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కొంత మందిని భయపెట్టి భూములను కొనుగోలు చేశారని మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పారు. కోకాపేట భూములను ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా ఎకరానికి నలభై కోట్లు వచ్చాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కీసర గుట్టలో 1981లో పది మందికి 94 ఎకరాలు ఎస్సీలకు నాటి ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్కు చిత్త శుద్ధి ఉంటే భూమి అమ్ముకున్న ప్రతి రైతుకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరణి వెబ్పోర్టల్తో దొరలకే లాభం జరుగుతున్నదని చెప్పారు.