Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) పరిధిలో పని చేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (మెడికల్ ఆఫీసర్లు) సాధారణ బదిలీల కోసం ఎంతో కాలం ఎదురు చూస్తున్నారు. వీరి సాధారణ బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు చేసుకున్న వారందరికి ఈ నెల మూడున ఉదయం 11 గంటలకు కోఠిలోని డీహెచ్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. వారు సంబంధిత సర్టిఫికేట్లతో హాజరు కావాల్సి ఉంటుంది.