Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - డోర్నకల్
నూతన పెన్షన్ విదానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి అన్నారు. గురువారం దేశవ్యాప్తంగా జరుగుతున్న జీపుజాతాలో భాగంగా టీఎస్ యూటీఎఫ్ డోర్నకల్ మండల శాఖ ఆధ్వర్యంలో జీపు జాతాకు ములకలపల్లి ఉన్నత పాఠశాలలో ఘన స్వాగతం పలికారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పలు పాఠశాలలను సందర్శించిన అనంతరం కన్నేగుండ్ల, డోర్నకల్ ఉన్నత పాఠశాలల్లో ఆయన మాట్లాడారు. నూతన విధ్యా విధానం-2020 లోని లోపాలను సవరించాలని కోరారు. ఈమేరకు దేశ వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రపతికి అందించనున్నామన్నారు. ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. జాతాలో జిల్లా కార్యదర్శి నామ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు వివేక్, మండల అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ అజీజ్, శివ ప్రసాద్, సీనియర్ జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.