Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నవతెలంగాణ - సిటీబ్యూరో
శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ కోసం ఇంజినీరింగ్ కన్సల్టెన్సీలు దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారం ప్రకటన విడుదలైంది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మూడేండ్లలో ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి జనరల్ కన్సల్టెంట్ ద్వారా ఇంజినీరింగ్ కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నట్టు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో ఎంపికైన స్పెషల్ పర్పస్ వెహికిల్లో భాగ స్వాములైన హెచ్ఎండీఏ, హెచ్ఎంఆర్ఎల్, టీఎస్ఐఐసీ ఈ నెల 6న ప్రీ అప్లికేషన్ సమావేశం నిర్వహించనున్నాయని వివరించారు. మరిన్ని వివ రాలకు WWW.hmrl.co.in వెబ్ సైట్ని సందర్శించవచ్చునని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 13 వరకు సమయం ఉందని పేర్కొన్నారు.