Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యార్థుల స్కాలర్షిపులు రద్దు చేయడం వల్ల పేద విద్యార్థులను చదువులకు దూరం చేయడమేననీ, తక్షణమే ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్వెస్లీ, టి. స్కైలాబ్బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 8వ తరగతిలోపు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ పేద విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిపులను ఇవ్వబోమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సరైందికాదని తెలిపారు. దేశం 100శాతం అక్షరాస్యత సాధించాలంటూ ఒకవైపు చెబుతూనే ఇలాంటి ప్రమాదకర నిబంధనలు తేవడంతో లక్ష్యం నెరవేరదని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనీ, లేనిచో మిగతా సామాజిక విద్యార్థి, ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.