Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రానున్న రోజుల్లో త్రీడీ ప్రింటింగ్ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కానుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 'యామ్ టెక్' సంస్థ హైదరాబాద్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎక్స్పోలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్రీడీ ప్రిటింగ్, ఆవిష్కరణల రంగంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భారత్లో టెక్నాలజీని అభివృద్ధి చేసి విదేశాలకు అందిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మెడికల్, పరిశ్రమ రంగాల్లోనూ ఈ త్రీడీ ప్రిటింగ్ సాంకేతికతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ ఈ సందర్భంగా వివరించారు.