Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీలోని 160 సెక్షన్ కింద సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ అలోక్ కుమార్ షా పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల ఆరో తేదీన హైదరాబాద్లో గానీ, ఢిల్లీలో గానీ సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో కవితను కోరారు. ఢిల్లీలో బయట పడ్డ మద్యం పాలసీకి సంబంధించిన స్కామ్లో విచారణ సందర్భంగా 14 మంది పేర్లు వచ్చాయని ఇందులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి కొంత వివరణను ఇవ్వడానికి గానూ తమ ఎదుట హాజరు కావాలని కవితను ఈ నోటీసులో సీబీఐ కోరింది. అయితే, నోటీసులపై స్పందించిన కవిత.. విచారణకు హైదరాబాద్లోని తమ నివాసానికే రావాల్సిందిగా సీబీఐకి సమాచారమిచ్చారు.