Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిస్మస్కు ముందే శంకుస్థాపన: మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్రిస్టియన్ భవన నిర్మాణానికి రెండెకరాల భూమి కేటాయించామనీ, క్రిస్మస్కు ముందే శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. క్రిస్టమస్ వేడుకల సందర్భంగా ఆ వర్గాల ప్రతినిధులు, అధికారులతో శనివారం హైదరాబాద్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈనెల 21లేదా 22 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్చే క్రిస్మస్కి ముందే ఉప్పల్ బగాయత్ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాల పరిధిలో క్రైస్తవ మహిళలకు పంపిణీ చేయనున్న దుస్తులను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శాంపిల్ కేకును మంత్రి కొప్పుల కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, , తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ రాజీవ్ సాగర్, మైనార్టీ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, క్రిస్టియన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఏకే ఖాన్ పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.