Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31 వరకు పొడిగింపు : ఇంటర్ బోర్డు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్కాలర్షిప్లను అందిస్తున్నదని తెలిపారు. సెంట్రల్ సెక్టార్ స్కీం కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవడంతోపాటు పునరుద్ధరణ దరఖాస్తులను ఈనెల 31 వరకు సమర్పించేందుకు అవకాశముందని సూచించారు. సంస్థాగత ధ్రువీకరణ కోసం చివరి తేదీ జనవరి 15 వరకు ఉందని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు http://scholarship.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. తాత్కాలికంగా ఎంపికైన 54,458 మంది విద్యార్థుల జాబితానుtsbie.cgg.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని వివరించారు.