Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఆయన వర్థంతి...
- నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆధిపత్య ధోరణులు, వివక్షకు తావివ్వకుండా సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో పరోపకారం పరిఢవిల్లేలా కలిసిమెలసి జీవించాలనే, వసుదైక కుటుంబ ధక్పథాన్ని తన రాజ్యాంగం ద్వారా పౌర సమాజానికి అందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. డిసెంబర్ 6వ తేదీ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. తాను అనుభవించిన సామాజిక వివక్షను సవాల్గా తీసుకుని విజయం సాధించి విశ్వమానవ సౌభ్రాతృత్వానికి దిక్సూచిగా నిలిచి, ప్రపంచ మేధావిగా ఎదిగిన అంబేద్కర్ జీవితం సదా ఆచరణీయమైనదని సీఎం అన్నారు. జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించారనీ, ఆయన భారతదేశ అస్థిత్వపు ప్రతీక అని చెప్పారు. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించాలనే అంబేద్కర్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం సకల జనుల సాధికారత దిశగా కషి చేస్తున్నదన్నారు. తర తరాలుగా సామాజిక ఆర్థిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల అభ్యున్నతికి కనీవినీ ఎరుగని రీతిలో అమలు చేస్తున్న 'దళితబంధు' పథకానికి ప్రేరణ, స్పూర్తి అంబేద్కర్ మహాశయుడేనని స్పష్టం చేశారు. కొత్త సచివాలయానికి ''డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం'' అని పేరు పెట్టుకున్నామన్నారు. దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టిస్తున్నట్టు తెలిపారు.