Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యక్తికాదు...ఓ వ్యవస్థ అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కల్పించిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజల హక్కులను కాలరాస్తున్నదని విమర్శిం చారు. వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. అంబేద్కర్ రా జ్యాంగ స్ఫూర్తితో ప్రజల సమస్యలపై పోరాటం చేస్తా మని తెలిపారు.
ఖర్గేతో మహేష్కుమార్ భేటీ
ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్కుమార్గౌడ్ భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో ఖర్గేను ఆయన మర్యాగపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితులను ఈ సందర్భంగా వివరించారు.