Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్
ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ బహదూర్ 73వ వర్ధంతి సందర్బముగా బుధవారం తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినముగా జలసౌధలో జరుపుకున్నారు. 2021 డిసెంబర్ ఏడు నుంచి నేటి వరకు దివంగతులైన 71 మంది ఇంజినీర్ల చిత్రపటాలకు పుష్పాలతో తెలంగాణ ఇంజినీర్లు నివాళులర్పించారు. ముందుగా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహానికి ఇరిగేషన్ ఈఎన్సి అడ్మిన్ అనిల్ కుమార్, జలవనరుల అభివృద్ది సంస్థ ఛైర్మన్ వి. ప్రకాష్. ఈఎన్సీ జనరల్ మురళీధర్ తదితరులు విద్యాసాగర్ రావు విగ్రహానికి పూల మాలలు వేసి స్మరించుకున్నారు. అలాగే రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నేపథ్యంలో నివాళులర్పించారు. ఈ సంద ర్బంగా వి. ప్రకాష్, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంజినీర్లకు రావాల్సిన అన్ని అల వేన్సులను సకాలంలో అందించడమే వారికి అందించే నివాళి అనే లక్ష్యంతో ఒక సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి పరిచామన్నారు. విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం 161 మంది చనిపోగా కోవిడ్ వద్ధి తగ్గిన కారణంగా ఇది 71కి తగ్గిందని, ఈ సంఖ్య ఇంకా తగ్గాలని కోరుకున్నారు. సీఎం ప్రత్యేక అధికారి శ్రీధర్ రావు దేశ్ పాండే మాట్లాడుతూ ఈ ఏడు చనిపోయిన వారిలో తనకు 25 ఎండ్లుగా సన్నిహితుడైన నిజాం వెంకటేశం ఉన్నారని గురుత్చేసుకున్నా రు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం గౌరవా ధ్య క్షులు చంద్రమౌళి, ఇంజినీర్స్ జేఏసీ చైర్మన్ వెంకటేశం, ప్రో.డా.రమణా నాయిక్, రమా దేవి, అనేక మంది రిటైర్డ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.