Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందే
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం 'చలో రాజ్భవన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా పని చేసినట్టు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాల్లేవని చెప్పారు. గవర్నర్ వ్యవస్థతో ఎలాంటి ప్రయోజనం లేదనీ, ప్రజాస్వామ్యం మరణిస్తున్నదనీ, అందుకే ఈ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో బిల్లులను ఎంత కాలం ఆపాలో గడువు లేకపోవడంతో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం, ఫెడరల్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. గవర్నర్ వ్యవస్థపై సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఈనెల 29న సేవ్ ఫెడరలిజం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వివరించారు.