Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడిటర్, సీజీఎం సంతాపం
నవతెలంగాణ - రామగిరి
నవతెలంగాణ తెలుగు దినపత్రిక హైదరా బాద్ హెడ్ ఆఫీసులో పనిచేస్తున్న కాంపెల్లి కిషన్ మాతృమూర్తి కాంపెల్లి లక్ష్మి మంగళవారం మృతిచెందింది. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతోంది. ఆమెకు ముగ్గురు కొడుకులు రాజ్ కుమార్, కిషన్, వినోద్ కుమార్, కూతురు స్వప్న ఉన్నారు. ఆమె మృతిపట్ల నవతెలంగాణ ఎడిటర్ సుధాభాస్కర్, సీజీఎం ప్రభాకర్ సంతా పం తెలిపారు. కిషన్ స్వగ్రామం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్లలో కుటుంబ సభ్యులను నవతెలంగాణ కరీంనగర్ రీజియన్ మేనేజర్ యాదగిరి, డెస్క్ ఇన్చార్జి అనిల్కుమార్ పరామర్శించారు.