Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- టీఎస్పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 14 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు వచ్చేనెల నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువుందని వివరించారు. సబ్జెక్టుల వారీగా లెక్చరర్ పోస్టులు, విద్యార్హతలు, ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.