Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
సివిల్స్ అభ్యర్థులతో ప్రముఖ సినీ దర్శకులు రామ్గోపాల్వర్మ (ఆర్జీవీ) ముచ్చటించారు. బుధవారం హైదరా బాద్లోని క్రిష్ణప్రదీప్ 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సంస్థ చైర్మెన్ క్రిష్ణప్రదీప్ అడిగిన పలు ప్రశ్నలకు ఆర్జీవీ తనదైన శైలిలో ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా నేటి యువత హక్కులు, ఎల్జీబీటీపై సుప్రీం కోర్టు తీర్పు, ప్రస్తుత విద్యావిధానం, కుటుంబ వ్యవస్థ, మహిళల పట్ల సమాజంలో ఉన్న తీరు వంటి విషయాలను వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కూడా ఆయన సమాధానమిచ్చారు. విద్యావిధానంలో నిరంతరం మార్పు రావాలని ఆర్జీవీ అన్నారు. ఎల్జీబీటీల పట్ల సమాజం దృక్పథం మారాలని కోరారు. త్వరలో రాబోయే 'డేంజరస్' సినిమా గురించి వివరించారు.