Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరణకు ఆటంకాల్లేకుండా త్వరగా జరగటానికి కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు ఈనెల పదో తేదీ నుంచి టీఎస్జీసీసీఎల్-475 ఆధ్వర్యంలో 'సంకల్ప ఆశీస్సుల యాత్ర'ను చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను గురువారం హైదరాబాద్లో ఆ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ కెపి శోభన్బాబు నేతృత్వంలో ఆవిష్కరించారు. క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాల్లేకుండా త్వరగా పూర్తి కావాలంటూ ఈనెల పది నుంచి 12 వరకు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నుంచి అదే జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు సంకల్ప ఆశీస్సుల యాత్ర చేపడుతున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, గాయత్రి, మహేందర్, శిరీష, మల్లిక, రేఖ, షబానా తదితరులు పాల్గొన్నారు.